ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 8:04 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఐటీ టవర్‌ను ఎంప్లాయ్‌మెంట్ హబ్‌గా మార్చాలి

కరీంనగర్,అర్జున్ సమాచారం:
లని డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు డీవైఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఇండస్ట్రియల్ జోనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ టవర్‌లో ఖాళీగా ఉన్న స్థలాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ఐటీ సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బీపీఓలు, స్టార్టప్‌లను తీసుకువచ్చి స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఉద్యోగ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రత్యేక ప్లేస్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని అన్నారు. ధర్నా అనంతరం నాయకులు ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జోనల్ మేనేజర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించే వరకు పోరాటం కొనసాగిస్తామని నరేష్ పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి. సురేష్, ఉపాధ్యక్షులు శివకుమార్, రాజ్‌కుమార్, సహాయ కార్యదర్శులు అరవింద్, విజయ్‌తో పాటు లక్ష్మణ్, అతీష్, శిరిప్రసాద్, అనీల్, నితిన్, విష్ణు, రాము తదితరులు పాల్గొన్నారు.
===========================